జోగులంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి స్వాతంత్ర గౌరవ పాదయాత్ర

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గౌరవ స్వతంత్ర పాదయాత్ర 4వ రోజు శుక్రవారం ధరూరు నుంచి బురేడిపల్లి,బిజ్వారం మధ్యాహ్నం చేరుకొని.వాల్మీకి విగ్రహానికి,అంబేద్కర్ విగ్రహానికి, వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఉలిగేపల్లి,అడివి రావులచెరువు,మల్దకల్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పాదయాత్ర రోడ్డు వెంబడి  రైతులు పొలాలలో సమస్యలను తెలుసుకొని రైతులు తమ గోడు ను వినిపించారు.కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రైతు సమస్యలు తీరుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శివమణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరుబాబు,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగరాజు, మల్దకల్ మండల అధ్యక్షుడు నల్లారెడ్డి ,గట్టు మండల అధ్యక్షులు గౌస్,అధికార ప్రతినిధి నందు,జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్,గద్వాల్ మండల్ నాయకులు రఘునాయుడు ,అలెగ్జాండర్, బిసన్న, మాచర్ల వీరేష్, రాముడు,గౌస్, సుధాకర్, కోటి గౌడు ,మురళి ,వెంకటేష్,మోష, నరసింహ,కార్యకర్తలు పాల్గొన్నారు.