*జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు*.

అల్లంపూర్ జులై   జనం సాక్షి* తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం రాష్టం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి నీరజ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీలో అధికార ప్రతి నీది డాక్టర్ మంద జగన్నాథం, అల్లంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం లు వేరువేరుగా ఆలయాలను  దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్,వేదపండితులు ఆనందశర్మలు, వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి, ఆలయ ప్రతిష్టతను  వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట తాలూక టిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రామ్ రెడ్డి జయ రాములు, గిడ్డ రెడ్డి తదితర టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.