జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం*

….ఎమ్మెల్యె చిట్టెం.
మక్తల్ సెప్టెంబర్ 09(జనంసాక్షి)
ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని,పూలే విద్య వివక్ష, పేదరికం,ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యె చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం నర్వ మండల పరిధిలోని రాయికోడు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు ఎంపీపీ కే జయరాములు, గ్రామ సర్పంచ్ డి సుశీల ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు అన్నారు. పూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని కుల,మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేసి సమాజం విద్యా పరంగా ,ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి గవిని జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు గౌడ్, నర్వ పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ వీణ వతి,ఎంపీడీవో రమేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు.ఎం శంకర్,కందుకూరి శ్రీనివాసులు,మ్యాతరి గోపాల్, ఏం నారాయణరెడ్డి, చిన్న హనుమంతు, డ్రైవర్ వెంకటయ్య, వార్డు మెంబర్ రమేష్, నౌసు నర్సిములు,మ్యాతరి రామక్రిష్న పెద్దలు,యువకులు పాల్గొన్నారు.