టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

కుల్కచర్ల, సెప్టెంబర్ 23(జనం సాక్షి):
కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోమాల అనంతయ్య, వార్డు సభ్యులు పోమాల శోభ, చిట్టెల వెంకటయ్య, ముజాహిద్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 50 మంది పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో పరిగిలోని వారి నివాసంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గులాబీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో చేరడం జరుగుతుందన్నారు.కొత్తగా చేరిన వారికి పార్టీలో సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు.మాజీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సారా శ్రీనివాస్, రైతుబంధు మండల అధ్యక్షుడు కేబీ రాజు, టిఆర్ఎస్ నాయకులు పెంటయ్య, రామకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముజాహిద్పూర్ గ్రామం నుండి కాంగ్రెస్ నాయకులు మొసలి అంజీలయ్య, భీమయ్య, రమేష్, చిన్న అంజీలయ్య, మ్యాకల నర్సింలు,చిలుముల శ్రీను, సందని రాములు,        తానెం తీర్మాలయ్య, మాజీ సర్పంచ్  గొల్ల కృష్ణయ్య తదితరులు టిఆర్ఎస్ లో చేరడం జరిగింది.