టి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలిటి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి


జనంసాక్షి నవంబర్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మినేటి జహంగీర్ అన్నారు .గురువారం మున్సిపల్ కేంద్రంలో  టీయూడబ్ల్యూజే  ఐజేయూ మోత్కూరు మండల శాఖ అధ్యక్షుడు దబ్బెటి సోంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ టియుడబ్ల్యూజే అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు తమిళనాడు తరహాలో పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు.అర్హులైన జర్నలిస్టుల కు అక్రిడియేషన్ లు అందించాలని కోరారు. మండలం నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ ప్రతినిధులు ఆకవరం శ్రీనివాస్ చారి,ఎం డి షాకీర్,మాశెట్టి వెంకన్న,కాపర్తి సైమన్,నర్రె సురేష్,బుంగపట్ల యాకయ్య,గాదేబోయిన నాగరాజు,గనగాని రాజేష్ ,వారాల నరేష్,పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.