టీచర్స్ డే సందర్భంగా ఔదార్యం చాటుకున్న పూర్వ విద్యార్థులు..

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి/మండలానికి చెందిన గాజుల రవి (ప్రజా జ్యోతి రిపోర్టర్ )ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య సేవల నిమిత్తం నిమ్స్ (హైదరాబాద్) హాస్పటల్లో కొద్ది రోజుల నుండి అక్కడే ఉంటున్నారు.గతంలో రవి వద్ద విద్యనభ్యసించిన విద్యార్థులు (2008-09)తమ గురువుకు వైద్య ఖర్చుల నిమిత్తము ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో సోమవారము ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్షరాల 36,000 రూపాయలు అందజేసి ఔదార్యం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అనుమాండ్ల నరేందర్, కొమ్మల ప్రహసిత్,తోట శరత్ పాల్గొన్నారు.