టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభలను విజయవంతం చేయాలి…

నిర్మల్ బ్యూరో, ఆగస్ట్30,జనంసాక్షి,,
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా  మహాసభలను విజయవంతం చేయాలని కార్యనిర్వహక సభ్యుడు వెంకగారి భూమయ్య అన్నారు. మంగళవారం రోజున నిర్మల్ పట్టణంలోని స్థానిక జెడ్పి సమావేశ మందిరంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) కార్యనిర్వాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ ఆధ్వర్యంలో
 ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మహాసభలను విజయవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలను గురించి సమావేశంలో చర్చించారు. మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అక్రిడేషన్ సంబంధిత సమస్యలను పరిష్కారానికి యూనియన్ తరపున కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాతురి కైలాష్,
 కార్యనిర్వాహక కమిటీ సభ్యులు రాచమల్ల  రాజశేఖర్, గాండ్ల రాజశేఖర్, వకుళాభరణం ప్రశాంత్, అశోక్ ,కూన రాజు ,పుప్పాల శేఖర్ ,రషీద్ అలం,సట్ల హనుమాన్లు, దేగామా యోగేష్, సురకంటి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.