టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు

వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వరుసగా రెండో ఏడాది భారత జాతీయ పతాకం రెపరెపలాడిరది. భారత 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికాలోని భారతీయులు టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ’భారత్‌ మాతాకి జై’, ’వందే మాతరం’ అంటూ
నినాదాలు చేశారు. స్వాతంత్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయులు హాజరయ్యారు. కాగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.