టేకులపల్లి మండలం లో అజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు

– రూట్ మ్యాప్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం

టేకులపల్లి, ఆగస్టు 13( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో ఆజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించ నున్నట్లు అందుకు రూట్ మ్యాప్ ను కాంగ్రెస్ శ్రేణులు విడుదల చేసినట్లు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తెలిపారు . స్థానిక మండల కాంగ్రెస్ పార్టి కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కమిటి సభ్యులు ,ఇల్లందు నియోజకవర్గ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు పాల్గోని మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10.30 గంటలకు టేకులపల్లి మండలంలో నిర్వహించే అజాది కా గౌరవ్ పాదయాత్ర కు డిసిసి అధ్యక్షులు భద్రాచలం ఏమ్మెల్యే పోదెం వీరయ్య ముఖ్య అతిధి గా పాదయాత్ర లో పాల్గోంటారని , పాదయాత్ర గోలియా తండా బంక్ వద్ద నుండి టేకులపల్లి ఊరి బయట వరకు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు.
ఇల్లందు నియోజకవర్గం ,టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోని అజాది కా గౌరవ్ పాదయాత్ర ను విజయవంతం చేయవల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి భుక్యా మంగిలాల్,నాయకులు డా”రవి, డాక్టర్ శంకర్ నాయక్, ఎస్టీ సెల్ నాయకులు భుక్యా దేవా నాయక్ రవీందర్ సింగ్, జీవి భద్రం ,మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, ఎస్సీ సెల్ జల్లా వైస్ ప్రెసిడెంట్ అర్జున్ రావు,శ్రీనివాస్ గంగారం మాజీ సర్పంచ్,సరిలాల్ టేకులపల్ల ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు,ఈశ్వర్ గౌడ్,కాయం రమేష్,గోగ్గెల పాపారావు తదితరులు పాల్గోన్నారు.