డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్ (కాల్వ శ్రీరామ్పూర్) : కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరామ్పూర్ మండలం ఊశన్నపల్లి గ్రామానికి చెందిన ఎం.శంకరమ్మ(20) అనే డిగ్రీ విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకొవడానికి గల కారణాలు తెలియరాలేదు.