డిపాజిట్ల సేకరణమహోత్సవం కార్యక్రమం

సంగారెడ్డి టౌన్ జనం సాక్షి సంగారెడ్డి పట్టణం లోని ఏపీజీవీబీ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిపాజిట్ల సేకరణ మహోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా రీజనల్ మేనేజర్ మాట్లాడతూ ఏపీజీవీబీ బ్యాంకు లో గృహరుణాల కొనుగోలు మరియు బంగారు ఆభరణాల పై మా బ్యాంకు చాలా తక్కువగా వడ్డీ రేట్లు ఇస్తుంది అన్నారు. అలాగే డిపాజిట్ల మీద సంవత్సరానికి 5.95 శాతం వడ్డీ ఇస్తుంది అని మాట్లాడారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా రీజల్ మేనేజర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్, మేనేజర్ బిసినెస్ సమతా,మేనేజర్ ఆపరేషన్స్ సుబ్బారావు, ఐటీ మేనేజర్ శివ ప్రసాద్ మరియు ఏపీజీవీబీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు