డి ఎల్ పి ఓ క్షేత్రస్థాయి పర్యటన

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 2
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ క్రీడా ప్రాధాన్యాలను వేగంగా పూర్తి చేయాలని డి.ఎల్.పి.ఓ లతా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శంకరపట్నం మండలం ఎరడపల్లి, చింతగుట్ట గ్రామాల్లో గ్రామీణ క్రీడ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్ పి ఓ జి లత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రార్ధనలను నిర్మాణం చేసి, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో ఖాజా బషరోద్దిన్, సర్పంచులు కల్వకుంట్ల రంజిత్ రావు, ఆడెపు రజిత లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు.