డెంటల్ హాస్పిటల్ ఏర్పాటుచేసిన డాక్టరమ్మకు సన్మానించి అభినందించిన మున్సిపల్ కౌన్సిలర్లు,తెరాస నాయకులు,.

జనంసాక్షి కొత్తకోట,జూన్ 25,                   కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో నూతనంగా డెంటల్ హాస్పిటల్ ఏర్పాటుచేసిన నిర్వాహకురాలు డాక్టర్ స్నేహను,వారి సిబ్బందిని మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి,పద్మ అయ్యన్న,ఖాజమైనద్దిన్, ఎరుకలి తిరుపతయ్య,తెరాస సీనియర్ నాయకులు హనుమంతు యాదవ్,ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం వెంకటేశ్వర్లు,సీనియర్ జర్నలిస్ట్ నాకొండ యాదవ్,తెరాస సంయుక్త కార్యదర్శి గాడిలమహేష్ లు పాల్గొని శాలువా కప్పి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పల్లె పాగు ప్రశాంత్ గారిని కలసి వారి కూతురు పల్లె పాగు స్నేహను ఒక మంచి డెంటిస్ట్ డాక్టర్ గా తీర్చిదిద్ది కొత్తకోటలోడెంటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు.