ఢిల్లీలో నిలిచిన మెట్రో రైలు సర్వీసులు…

న్యూఢిల్లీ: భూకంపం సంభవించిన నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇవాళ నేపాల్‌లో రాజధాని ఖాట్మాండ్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తర భారతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. కాగా, ఈ భూకంపం కారణంగా భారత్‌లోని బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో భూమి కంపించింది.