ఢిల్లీ 116/2..

న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో భాగంగా ఢిల్లీ – రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొంటున్నాయి. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్ లు ధాటిగా ఆడడం ప్రారంభించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 45 పరుగులు చేశారు. తంబే బౌలింగ్ లో అగర్వాల్ (37) వెనుదిరిగాడు. అయ్యర్ కు డుమిని జత కలిశాడు. కానీ రాణిస్తున్న అయ్యర్ (40) ను మోరీస్ పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలో 116 పరుగులు చేసింది. డుమిని 24, యువరాజ్ సింగ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.