*తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పెబ్బేరు పోలీసులు*

మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండల్ కందురు గ్రామ చెందిన తెలుగు వెంకటేష్  బాలుడు  ఇంట్లో తల్లిదండ్రులు మదలించారని యింట్లో చెప్పాపెట్టకుండ నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలుడిని పెబ్బేరు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం బాబును పెబ్బేరు చౌరస్తాలో లో చూసిన  వనం మల్లేష్ యాదవ్, సాయి ప్రపుల్ నాయుడులు బాలుడిని పోలీస్ స్టేషన్ కు  తీసుకెలి ఎస్ ఐ రామస్వామి కి బాలుడి గురించి వివరాలు ఇచ్చారు. ఎస్ ఐ రామస్వామి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఇరువురి కి కౌన్సిలింగ్ ఇచ్చి  బాబు ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు.