తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిమృతి

z8vok2ul

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండుగల్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న ట్యాంకర్, వ్యాను ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు దిండుగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కుటుంబాలకు చెందిన వారు వ్యాన్ లో విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి ఉండటంవల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.