తాగు నీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు…

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 16 (జనంసాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో విద్యార్థిలకు చేదు అనుభవం..కూడు లేకపోయినా పర్లేదు కానీ తాగటానికి నీరు ఇవ్వండీ అంటూ విద్యార్థుల వేడుకోలు…గద్వాల మార్కెట్ యార్డులో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో తాగటానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి పెట్టకపోయిన పర్లేదు కానీ తాగటానికి నీరు ఇస్తే సరిపోయేది అని అనుకుంటున్నారు.బడి వెళ్లే సమయంలో మధ్యాహ్నం ఒంటిగంట లోపల తినే విద్యార్థులు సభ అయిపోయే సమయం ఎంతసేపు అవుతుందో ఏమో అని విద్యార్థులు లబోదిబోమంటున్నారు.