తాత్కాలిక బోధన సిబ్బంది నియామకానికి దరఖాస్తు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలోని కస్తుర్బా గాంధీ బాలిక పాఠశాలల్లో తాత్కాలిక బోధనా సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిరాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలంపూర్ లో తెలుగు, ఇంగ్లీష్,మాథ్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీ,బోటని, జువాలజి, అయిజ లో సివిక్స్, ఇంగ్లీష్, గద్వాల లో సోషల్, రాజోలిలో హిందీ,మాథ్స్ బోధించడానికి దరఖాస్తులు సెప్టెంబర్ 3 వ తేది సాయంత్రం లోపు ఆయా కె జి బి వి లలో సమర్పించగలరని ఆయన తెలిపారు