తాలిబన్ల నుంచి ముగ్గురు భారతీయులు సురక్షితం

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. ఓ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో పని చేస్తున్న వారిని విమానంలో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్టు చెప్పింది. భారతీయులు వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంబసీ సూచించింది. ఇక ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిణామాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న భారత జర్నలిస్టులందరూ అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది.