తాలిబన్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ లో తాలిబన్ల శిక్షణ శిబిరంపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఘటనలో ఐదుగురు తాలిబన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. లడ్హా సబ్‌ డివిజన్‌లోని బాబాగఢ్‌లోని తాలిబాన్ల శిబిరంపై మానవ రహిత విమానం రెండు మిస్పైల్స్‌తో దాడి చేసిందని అధికారులు వివరించారు.