తిమ్మప్ప స్వామికి వెండి గొడుగులు వితరణ

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పలువురు భక్తులు సేవా కైంకర్యాలు అందజేస్తున్నారు. శనివారం రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన పీ లక్ష్మీదేవి తిమ్మారెడ్డి దంపతులు 927 గ్రాముల వెండితో తయారు చేసిన గొడుగును స్వామివారికి బహుకరించారు. అలాగే కర్నూలు జిల్లా ఉల్చాల గ్రామానికి చెందిన గంగమ్మ లక్ష్మన్న దంపతులు 160 గ్రాముల వెండి గొడుగును స్వామివారికి అందజేయగా అర్చకులు పూజలు నిర్వహించి దాసలను ఘనంగా సన్మానించారు.