తిమ్మప్ప స్వామికి వెండి వితరణ

మల్దకల్ ఆగస్టు 28 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామం కు చెందిన ప్యాట్ల లక్ష్మారెడ్డి దంపతులు 140gr ల వెండిని బహూకరించారు.దేవతా విగ్రహాలకు వెండి కవచాలను చేయించే పనిలో భాగంగా దాతల నుండి వెండిని దేవాలయం నిర్వాహకులు స్వీకరిస్తున్నారు.ఇందులో భాగంగా దేవాలయంలో అర్చకులు పూజలు నిర్వహించి దాతలకు ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.