తిమ్మప్ప స్వామి దేవాలయంలో హరికథ కాలక్షేపం

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా శ్రీనివాస కళ్యాణం హరికథా కాలాక్షపాన్ని నిర్వహించారు.75వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ రూపాలలో స్వాతంత్ర వేడుకలు జరుగుతుండగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం హరికథా కాలక్షేపం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు నిర్వహించారు. హార్మోనియం వై రాములు, మృదంగం దండాలయ్య సహకారం అందించగా ఆంజనేయులు భాగవతార్ ఆధ్వర్యంలో హరికథ కాలాక్షేపం వీనుల విందుగా జరిగింది. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి ,సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.