తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

మల్దకల్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు రాయచూరు పట్టణానికి చెందిన సత్యా రెడ్డిదంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకులుమధుసూదనాచారి, రమేష్,రవి,దీరేంద్ర దాస్ పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రావు,తాటికుంట తిమ్మయ్య శెట్టి బ్యాంక్ నాగరాజు, బాదం శ్రీనివాసులు,మద్దెలబండ నాగరాజు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.