తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం

మల్దకల్ అక్టోబర్ 22(జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన పల్లా తిమయ్య శెట్టి గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ పట్వారీ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, పట్వారీ అరవిందరావు అర్చకులుమధుసూదనాచారి, రమేష్, రవి, దీరేంద్ర దాస్ పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ రెడ్డి తాటికుంట తిమ్మయ్య శెట్టి బ్యాంక్ నాగరాజు బాదామి శ్రీనివాసులు,మద్దెలబండ నాగరాజు, అశోక్ శేట్టి ,ప్రవీణ్ శెట్టి ,నరహరివెంకటేశ్వర్లు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area