తిరుమలాయపాలెం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం .తిరుమలాయపాలెం (నవంబర్ 14) జనం సాక్షి. తిరుమలాయ పాలెం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి నీళ్ళు శ్రీనివాసరెడ్డి.మాట్లాడుతూ.
ఏంతో మందికవులు,కళాకారులు,
ఉద్యమకారులు,విద్యార్థులు బలిదానం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబం స్వార్ధం కోసం వాడుకుంటున్నాది.
2014 కు ముందు కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటి గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆర్ధిక పరిస్థితి ఏంటి ప్రజలు ఆలోచించాలి.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంద్ర లోకాన్ని చూపిస్తూ తెలంగాణా యాసలో ప్రజలను మభ్య పెడుతుంటాడు.
తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని రెండు సార్లు కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే ధనిక రాష్ట్రం గా ఉన్న రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేసాడు.
కాళేశ్వరం పేరుతో ఐదున్నర లక్షల కోట్ల లో ప్రజల సొమ్ము లక్ష కోట్లు దొంగిలించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..
అలాంటి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి ని చేద్దామా.
గత ఎన్నికల్లో BRS ఇచ్చిన హామీలను ఏఒక్కటీ నెరవేర్చలేదు.
ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మన కష్టాలు తీరుతాయి.
మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మీ శ్రీనన్న ను గెలిపించండి. ఆశీర్వదించండి.