తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల:తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.పిట్ట గోడను ఢీకొని జీపు బోల్తా పడటంతో నలుగురు భక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న జీపు మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురైంది. 32వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొనడంతో జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.