తీహార్ సెంట్రల్ జైల్లో హత్య

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే ఖైదీని మరో ముగ్గురు ఖైదీలు కిరాతకంగా హత్య చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.