తుస్సుమన్న సమైక్య మంత్రుల సమావేశం
క్వార్టర్ల నుంచి బైటికిరాని మంత్రులు
దిగ్విజయ్కు మా వాణి వినిపిస్తాం
హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి) :
సీమాంధ్ర మంత్రుల సమావేశం తుస్సుమంది. నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం భేటీ అవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి మెజార్టీ మంత్రులు, నేతలు డుమ్మా కొట్టారు. అందరూ ఇళ్లలోనే ఉన్నా సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. మంత్రులు టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, శైలజానాధ్, పార్ధసారధి, ఎమ్మెల్యేలు మస్తాన్వలీ, గాదె వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. జులై 1న దిగ్విజయ్ సమక్షంలో సమైక్యవాణిని వినిపిస్తామన్నారు. దిగ్విజయ్ పర్యటన ముగిసిన అనంతరం ఢల్లీి వెళ్తామని పేర్కొన్నారు.