తెలంగాణలో హ్యుందాయ్‌ మెగా కారు టెస్ట్‌ సెంటర్‌

తెలంగాణకు తరలివస్తున్న పెట్టుబడులు
` హైదరాబాద్‌ లోని ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఆధునీకరణ
` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో హెచ్‌ఎంఐఈ ప్రతినిధుల భేటి
` సియోల్‌లో ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌తోనూ సీఎం భేటీ
` వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులపై కొరియన్‌ కంపెనీల ఆసక్తి
` ముఖ్యమంత్రి పిలుపునకు కొరియన్‌ జౌళి పరిశ్రమ సమాఖ్య సానుకూలత
` సీఎం రేవంత్‌ అమెరికా పర్యటన విజయవంతం
` తెలంగాణలో రూ.31,532 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 19 కంపెనీల ప్రతినిధులు
సియోల్‌(జనంసాక్షి): దక్షిణ కొరియా ఆటోమోటివ్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తెలంగాణలో కారు మెగా టెస్ట్‌ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్‌ సెంటర్‌లో ఆటోమేటివ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్‌ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ కేందం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా ఊఓఎఇ భారతదేశం సహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు సియోల్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చల అనంతరం ఊఓఎఇ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్‌ అని, భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్‌ సెట్టింగ్‌ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాల అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్‌ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్‌ టెస్టింగ్‌ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందన్నారు. రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్రగతిశీల, భవిష్యత్‌ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్‌ఎంఐఈ వంటి అత్యుత్తమ`తరగతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఎంఐఈ మెగా టెస్ట్‌ సెంటర్‌ సవిూపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుంది.
ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌తో భేటీ
అమెరికా పర్యటన ముగించుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు దక్షిణ కొరియాలోని సియోల్‌ చేరుకున్న ఆయన.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు..ఇందులో భాగంగా ఆయన ఎల్‌ఎస్‌ (ఎల్‌జీ) గ్రూప్‌ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్‌ కేబుల్‌, గ్యాస్‌, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్‌ గ్రూప్‌ బృందం అంగీకరించింది. మరోవైపు కొరియా టెక్స్‌టైల్‌ పరిశ్రమ సమాఖ్యతో సీఎం రేవంత్‌రెడ్డి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు కొరియా పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎనిమిది రోజుల పాటు అమెరికాలో సీఎం జరిపిన పర్యటన విజయవంతమైందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం నిర్వహించిన సవిూక్ష సమావేశాల ఫలితంగా.. 19 కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా వాణిజ్య సంస్థలతో సమావేశమైందని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్‌ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది.