తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ

తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో తెలంగాణ ఎన్నికలపై మాట్లాడానని..  రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు.  తెలంగాణలో  టీడీపీ బలంగా ఉందన్నారు.   శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.