తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఆందోల్    రాయికోడ్ జనం సాక్షి16 ఆందోల్ నియోజకవర్గంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం  శుక్రవారం రోజు  అందోల్  పట్టణంలో  తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవాల ర్యాలీలో  పాల్గొన్న శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్   అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని  ప్రసంగించారు .ఈ సందర్బంగా  ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ  నిజాం పాలకుల నుండి  విముక్తి పొందిన సందర్భంగా 75 వ జాతీయ సమైక్యతా  వజ్రోత్సవాలు జరుపుకోవడం  జరుగుతుందని  ,ఇటి   పోరాటంతో  ఎందరో అమరులైనారని వారి పోరాటం  మరువలేనిదన్నారు .ఈ కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ,అడిషనల్ కలెక్టర్ , రాష్ట్ర నాయకులు రాహుల్  కిరణ్  ,మార్క్ఫెడ్ రాష్ట్ర డైరక్టర్ జగన్మోహన్ రెడ్డి  ,జాగృతి రాష్ట్ర నాయకులు భిక్షపతి ,నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు,   జెడ్పీటీసీలు , ఎంపీపీలు ,ఎంపీటీసీలు  ,సర్పంచులు ,నియోజకవర్గ ప్రజలు  విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు