* తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ*

కమ్మర్పల్లి17 సెప్టెంబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రోజున ఉప్లూర్  గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బద్దం పద్మా చిన్నారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్ధం చిన్నారెడ్డి, గ్రామ ఎంపీటీసీ పిప్పేరా అనిల్, ఉప సర్పంచ్ నందగిరి రేఖ శ్రీధర్, గ్రామ కార్యదర్శి నరేందర్, కరోబార్ భాజేసబ్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అవారి మురళి మరియు నాయకులు అవారి సత్యం,రవి గౌడ్,రాజేశ్వర్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.