తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ

   జిల్లా ఎస్పీ కె,అపూర్వరావు
వనపర్తి: సెప్టెంబర్ 9 (జనం సాక్షి) పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా ప్రజలదని తెలంగాణ మట్టి మనుషులను తన సాహిత్యం ద్వారా తట్టిలేపిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణ రావు అని  వనపర్తి జిల్లా ఎస్పీ కె,అపూర్వరావు అన్నారు.జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు కాళోజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు. కాళోజీ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు నేటి తరానికే కాకుండా భావి తరాలకు ఆదర్శప్రాయుడని,ఆయన జీవితం దేశానికే ఆదర్శమన్నారు.అస్థిత్వం కోసం తెలంగాణ జాతిని జాగృతం చేసిన వ్యక్తి అని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించాలని వారు సూచించారు.కార్యక్రమంలో కార్యాలయ ఏవో రుక్మిణీ బాయి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area