తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మంథని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెండే రాజయ్యరాజయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు మెండే లక్ష్మి, పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు అందే భాస్కర చారి, ముత్తారం మండల పార్టీ అధ్యక్షులు రాజ్ మహ్మద్, యువత అధ్యక్షులు బడుగు మహేష్, నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.