తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

న్యూఢిల్లీ,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన ట్విటర్లో స్పందిస్తూ… రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకుశుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల కలలు, ఆంకాంక్షలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు నవ నిర్మాణ దీక్ష సందర్భంగా నవ్యాంధ్ర ప్రజలకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా సుసంపన్నత, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.