తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లపై కేంద్రం ఆరా
న్యూఢిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లపై కేంద్రం ఆరా తీసింది. ఎన్కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. జనగాం వద్ద జరిగిన ఎన్కౌంటర్పై ఎక్కువగా కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే శేషాచలం అడవులో జరిగిన ఎన్కౌంటర్పై కూడా కేంద్రం ఆరా తీసింది. రెండు రాష్ర్టాల డీజీపీలతో కేంద్ర రాష్ట్ర కార్యదర్శి గోయల్ మంగళవారం ఉదయం ఫోన్లో మాట్లాడి… వివరాలను అడిగి తెలుసుకున్నారు.