తెలుగు రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం
ఏపీకి రూ. 380 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు
న్యూ ఢిల్లీ, మార్చి 29: 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసింది. వివిధ పద్దుల కింద ఏపీకి రూ. 385 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు కేటాయించారు. ఏపీకి గణాంకాల అమలు కోసం రూ. 2.6 కోట్లు, స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్, ప్రత్యేక సాయం కింద మిగతా మొత్తం నిధులు మంజూరయ్యాయి. తెలంగాణకూ ఇవే పద్దుల కింద నిధులు మంజూరు చేశారు.