దంపతుల ఆత్మహత్యాయత్నం: నిలిచిపోయిన ఇళ్ల కూల్చివేత

నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం రామిరెడ్డిపాలెంలో ఆలయ భూముల్లో
నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తుంన్నారు. ఆ ఇళ్లలో ఒక ఇంటి యజమానులైన
దంపతులు ఇల్లు కూల్చవద్దంటూ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
దంపతుల ఆత్మహత్యాయత్నంలో అధికారులు ఇళ్ల కూల్చివేతను ఆపివేశారు.