దక్షిణ దిల్లీ ఓక్లా ఫేస్-2 కార్యాలయంలో భారీ మంటలు
నూదిల్లీ(పీటీఐ): దక్షిణ దిల్లీ ప్రాంతంలోని ఓక్లా ఫేస్-2 కార్యాలయం వెలుపల ఆదివారం భారీ మంటలు చెలరేగాయి. దిల్లీ ఫైర్ సర్వీస్(డీఎఫ్ఎస్)కు ఉదయం 8గం. సమయంలో ఈ సమాచారం అందడంతో 14 అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో ఇంకా తెలియలేదని డీఎఫ్ఎస్ సంస్థ తెలిపింది.