దళితుల అభ్యున్నతికి కృషి చేయాలి:ఏపీసీఎం
ఢిల్లీ:దళితుల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్లో నిర్వహించిన బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు హాజరైన ఆయన అనంతరం మాట్లాడుతూ దళితుల కోసం పాటుపడిన వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్ అని కొనియాడారు. సమాజంలోని అంటరానితనాన్ని అరికట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. దళితులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు సమష్టి కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశోక్గజపతిరాజు, సుజనాచౌదరి పాల్గొన్నారు.