దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్19
నిరుపేదలకు దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు రావడం హర్షనీయమని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.సోమవారం నెరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ కు చెందిన పరిమళ దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన హార్డ్ వేర్ షాప్ ను కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.వ్యాపార అభివృద్ధి చెంది నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి,చెన్నారెడ్డి,రాజు,శోభ,రమాదేవి,నవనీత,జయలక్ష్మి, శివ,మోహన్,మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area