దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి దగ్గర రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌ పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ సంగీత కచేరీ నిర్వహించారు. వాజ్‌పేయ్‌ పాలన గురించి బిజెపి నేతలు స్మరించుకున్నారు.