దుష్టచతుష్టయం పన్నాగాలు పారవు

చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు
ప్లీనరీలో మండిపడ్డ కొడాలి నాని

గుంటూరు,జూలై9(జనంసాక్షి  : ): చంద్రబాబుతో ముగ్గురు విూడియా మిత్రులు కలసి నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్టాన్న్రి దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో విూడియా`దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ’సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్పచ్రారం చేయడమే వీరి పని అన్నారు. సీఎం జగన్‌ను దించాలని ఆ నలుగురు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్టాన్న్రి దోచుకోవచ్చని వీరి ఆలోచనగా ఉందన్నారు. ఈ 420లకి ఎవరూ భయపడరు. దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇంగ్లీష్‌ విూడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్‌ విూడియంలో చదవొద్దా. ఆరోపణలు చేస్తున్న వారి పిల్లలు ఏ విూడియంలో చదివారు?. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పెన్షన్లు పెంచుతూ పోతున్నారు. పేద పిల్లల కోసం తండ్రి స్థాయిలో సీఎం జగన్‌ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా?. 95 శాతం హావిూలను అమలుచేసిన వ్యక్తి సీఎం జగన్‌. సీఎం జగన్‌ భగభగమండే సూర్యుడి
లాంటోడు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంటూ ప్రస్తుతించారు.దేశంలో చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ ఎవరూ లేరు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా?. దుష్టచతుష్టయం పర్మినెంట్‌గా పిచ్చాసుపత్రుల్లో చేరబోతున్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. తల్లి పాత్ర పోతుందా?. తల్లిని మించిన హోదా ఉంటుందా?. లోకేష్‌ ఫారెన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా వెళ్లారు?. ఓట్లకోసం భార్యను బజారుకీడ్చిన 420 చంద్రబాబు. 2024 చంద్రబాబుకు రాజకీయ సమాధే’ అని మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.