దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ,

రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక లో శనివారం రోజున 16 మంది లబ్ధిదారులకు శాదిముభారక్ చెక్కులను ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ మరియు
జడ్పీటీసీ నారోజి గంగారాం ఆధ్వర్యంలో మండల నాయకుల తో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తుందని , అందుకే ఢిల్లీ లో ఉన్న కేంద్ర మంత్రులు సైతం గ్రామ స్థాయి లో తిరుగుతున్నారని , తెలంగాణ సాధించుకున్న తరవాత దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో మన రాష్ట్రం ముందు ఉంటే మన రాష్ట్రంలో మన
పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం కారణంగా మన నియోజకవర్గం సంక్షేమ పథకాలలో ముందు ఉందని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేంధర్, జడ్పీటీసీ నారోజి గంగారాం,మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నెరగంటి బాలరాజు,
తహసిల్దార్ ముజీబ్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, మాజీ ఎఎంసి చైర్మెన్ సంజీవ్, ఎంపీటీసీ పత్తి సావిత్రి, అక్బర్ నగర్ సర్పంచ్ గంగామని రుద్రూర్ ఉపసర్పంచ్ ఆసియా కౌసర్ కాలీమ్, విండో చైర్మెన్ సంజీవ్ రెడ్డి,రుద్రూర్ తెరాస పార్టీ అధ్యక్షులు గంగారాం,మండల సోషల్ మీడియా కన్వీనర్ లాల్ మొహమ్మద్, నాయకులు రామగౌడ్,ప్రసాద్,శుభాని, హాబీబ్,ముజాహిద్ లబ్ధిదారులు పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు