“దొంగలు బాబోయ్ దొంగలు”

• కల్వకుర్తి విద్యానగర్ కాలనీలో దొంగ హల్ చల్…
•  రియల్ ఎస్టేట్ వ్యాపారి   ఇంట్లో దొంగతనం…
• 55 తులాల బంగారం,మూడు లక్షల నగదు     చోరీ..
• కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న     కల్వకుర్తి పోలీసులు…
నాగర్ కర్నూలు సెప్టెంబర్9 జనంసాక్షి : గత కొంతకాలంగా కల్వకుర్తి పట్టణంలో విచ్చలవిడి దొంగతనాలు జరుగుతున్నాయి వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు తాజాగా
కల్వకుర్తి పట్టణానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది కల్వకుర్తిలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనం ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి సాయంత్రం 6:30 లకు నిమజ్జనానికి వెళ్లడంతో అర్ధరాత్రి ఒకటి గంటల సమయంలో ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు దొంగతనం జరిగిందని నిర్ధారించుకున్ననారు ,
 55 తులాల బంగారం మూడు లక్షల రూపాయలు నగదు చోరీ అయినట్టు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కల్వకుర్తి పోలీసులు తెలిపారు..