ధరణి వెబ్సైట్ లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి .ధరణి మాడ్యుల్ లో పి. ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్ లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ధరణి దరఖాస్తుల ను పి. ఓ.బి లో ఉన్నవి పెండింగ్ క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పాత మాడ్యుల్ లో వున్న అన్ని కేసులు పరిష్కరించాలని,కొత్త మాడ్యుల్ కేసులు కూడా సమాంతరంగా అన్ని రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు పరిష్కరించాలని,ఫార్మాట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.