నందికొట్టకూరులో ఫ్లెక్సీల గొడవ

టిడిపి ఫ్లెక్సీలను తొలగించిన వైసిపి

నంద్యాల,జూలై19(జనం సాక్షి): నందికొట్కూరులో వైసీపీ,టీడీపీ మధ్య ప్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జ్‌ శివనందా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు ప్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీని వైసీపీ శ్రేణులు తొలగించి వైసీపీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కేజీ రోడ్డుపై ధర్నాకు దిగారు. నందికొట్కూరులో వైసీపీ నాయకులు దౌర్జనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ నేతలకు సవాల్‌ చేశారు. బ్యానర్లను చించివేయడం సిగ్గుమాలిన చర్యని, అన్న క్యాంటీన్‌కు ఆదరణ చూసి తట్టుకోలేకే బ్యానర్లు చించివేస్తున్నారని సౌమ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు