నలమాస్ తేజం ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం * సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా

టేకులపల్లి, అక్టోబర్ 28 (జనం సాక్షి): నలమాస్ తేజం సిపిఐ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, టేకులపల్లి మండలంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. టేకులపల్లి మండలంలోని తేజం స్తూపం నిర్మాణానికి ఆయన చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో ఈ గ్రామంలో పార్టీ ఎదుగుదలకు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నాయకత్వం గెలుపులో భాగస్వామ్యమైన తేజం కోసం బొమ్మనపల్లి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ తేజం ఆశయాలను సాధిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోతు రామచందర్,అయిత నాగర్జున చారి,కె వెంకన్న ,కె నరసింహారావు, టి నరేందర్, బి శ్రీలత, గంగా లచ్చమ్మ, జానయ్య, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.